57 వేలు దాటిన కరోనా కేసులు..

176
corona
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 57 వేలు దాటింది. గత 24 గంటల్లో 1610 కరోనా కేసులు నమోదు కాగా 9 మంది మృతిచెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 57,142 కేసులు నమోదుకాగా నిన్న ఒక్కరోజే 15,839 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,753 యాక్టివ్ కేసులు ఉండగా 42,909 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇప్పటి వరకు 830 మంది కరోనాతో మృతిచెందగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 531 కొత్త కేసులు నమోదు అయ్యాయి.

- Advertisement -