రాష్ట్రంలో 1300 దాటిన కరోనా మృతుల సంఖ్య..

131
covid 19
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 1273 కరోనా కేసులు నమోదు కాగా ఐదుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,30,274కి చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 19,937 యాక్టివ్ కేసులుండగా 16,809 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. 2,09,034 మంది కరోనా నుండి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇప్పటివరకు కరోనాతో 1303 మంది మృతిచెందగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 227 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.56 శాతంగా ఉండగా రికవరీ రేటు 90.77 శాతంగా ఉంది.

- Advertisement -