రాష్ట్రంలో 1.60 లక్షలు దాటిన కరోనా కేసులు..

251
coronavirus
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 2,058 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 10 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,60,571కు చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 30,400 యాక్టివ్ కేసులుండగా 1,29,187 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఇప్పటివరకు 984 మంది చెందారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.61శాతంగా ఉండగా, రికవరీ రేటు 80.45శాతంగా ఉంది.

24 గంటల్లో హైదరాబాద్ పరిధిలో 277, రంగారెడ్డిలో 143, కరీంనగర్‌లో 135, వరంగల్‌ అర్బన్‌ 108, సిద్దిపేట 106, ఖమ్మం 103, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 97 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 22,20,586 టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -