రాష్ట్రంలో వెయ్యి దాటిన కరోనా మరణాలు…

172
coronavirus
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 65 వేలు దాటాయి. గత 24 గంటల్లో 2,159 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 9 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,65,003కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 30,443 యాక్టివ్ కేసులుండగా 1005 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు 1,33,55 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. రాష్ట్రంలో 0.60శాతం మరణాల రేటు ఉండగా, రికవరీ రేటు 80.94శాతంగా ఉంది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 318 , రంగారెడ్డి 176, నల్గొండ 141, సిద్దిపేటలో 132, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 121, కరీంనగర్‌ 127, వరంగల్‌ అర్బన్‌లో 98 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం 23,29,316 టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -