రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన సీఎం కేసీఆర్‌

37
- Advertisement -

హైదరాబాద్‌లోని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యూయేషన్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈమేరకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతికి శాలువా కప్పి పుష్పగుచ్ఛంతో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్‌, బీజేపీ ఎంపీ కిషన్‌ రెడ్డి కూడా స్వాగతం పలికారు.

Also Read: చంద్రబాబును టెన్షన్ పెడుతున్న పవన్ ?

సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు మ‌హ‌ముద్ అలీ, స‌బితా ఇంద్రారెడ్డి, స‌త్య‌వ‌తి రాథోడ్, మ‌ల్లారెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, ఎంపీలు సంతోష్ కుమార్, వెంక‌టేశ్ నేత‌, ఎమ్మెల్సీలు మ‌ధుసూద‌నాచారి, ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, డీజీపీ అంజ‌నీ కుమార్‌తో పాటు ప‌లువురు రాష్ట్ర‌ప‌తికి స్వాగ‌తం ప‌లికారు.

Also Read: యాసంగిలో ప్రతి గింజ కొన్నాం: గంగుల

- Advertisement -