మాది రైతు ప్రభుత్వం : సీఎం కేసీఆర్‌

33
cm
- Advertisement -

రైతుల పట్ల తన అభిమానాన్ని, ప్రేమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి చాటుకున్నారు. మరణించిన రైతు కుటుంబానికి అండగా నిలిచారు. నేనున్నానంటూ సాయం అందించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శంచడానికి ఇటీవల వచ్చిన జాతీయ రైతు సంఘం కార్యకర్త విమల్ కుమార్.. ఈ పర్యటన అనంతరం హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్.. విమల్ మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అలాగే ఆయన కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు.

ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలోని రైతాంగానికి ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు, రైతు భీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలు రైతులకు ఉపయోగపడుతున్నాయని, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తున్నాయని చెప్పారు. తెలంగాణ పథకాల గురించి తెలుసుకున్న కర్ణాటక రైతాంగం.. తమ రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకాలు అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం 10 లక్షల రూపాయలను విమల్ కుమార్ కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. జాతీయ రైతు సమాఖ్య కర్ణాటక రాష్ట్ర అధ్యక్షులు శాంత కుమార్ అధ్యక్షతన మైసూరులో ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ రైతు బంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ఆ కుటుంబానికి సాయం అందేలా చూశారు.

కార్యక్రమంలో దక్షిణ భారత రైతు సంఘాల అధ్యక్షులు కోటపాటి నరసింహ నాయుడు, తెలంగాణ రైతు బంధు సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, చేతన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -