ప్ర‌ధానితో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ..

220
modi kcr
- Advertisement -

ఢిల్లీలో ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. సుమారు నలభై నిమిషాల పాటు వీరిద్దరూ సమావేశమయ్యారు. పెండింగ్ లో ఉన్న రాష్ట్ర పునర్విభజన హామీలు అమలు చేయాలని కేసీఆర్ కోరినట్టు సమాచారం. ఈ సందర్భంగా సుమారు16 అంశాలతో కూడిన వినతి పత్రాన్నిమోదీకి కేసీఆర్ అందజేశారు. ఆయా అంశాల పరిష్కారంపై మోదీ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఆ వినతిప్రతంలోని 16 అంశాలు..

– కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా
– కృష్ణా జలాల వివాదం పరిష్కారానికి వినతి
– సెక్రటేరియట్, రహదారి నిర్మాణ పనులకు బైసన్ పోలో గ్రౌండ్ భూముల బదిలీ
– హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు
– కరీంనగర్ లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు
– హైదరాబాద్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ (ఐఐఎస్ఇఆర్)
– ఆదిలాబాద్ లో సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పునరుద్ధరణ
– నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ మానుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్) – జహీరాబాద్ కోసం నిధుల విడుదల
– కొత్త జిల్లాల్లో 21 జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు
– వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్ టైట్ పార్క్ అభివృద్ధికి రూ .1000 కోట్లు కేంద్రం నిధుల విడుదల
– ఏపీ పునర్విభజన చట్టంలో షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన
– ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టుల పనుల పూర్తి అంశం
– ఎస్సీ వర్గీకరణ బిల్లు
– వరంగల్ లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు
– పునర్విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల కోసం రూ. 450 కోట్లు
గ్రాంట్స్ నిధుల విడుదల
– ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన ప్రతిపాదన

- Advertisement -