రాజస్థాన్‌లో తెలంగాణ సీఐడీ డీజీ గోవింద్‌ కారుకు ప్రమాదం

18
- Advertisement -

తెలంగాణ సీఐడీ డీజీ గోవింద్ సింగ్ కారు రాజ‌స్థాన్‌లో ప్ర‌మాదానికి గురైంది. ఈ ప్ర‌మాదంలో గోవింద్ సింగ్ తీవ్రంగా గాయ‌ప‌డ‌గా, ఆయ‌న భార్య మృతి చెందారు. కారు డ్రైవ‌ర్ కూడా తీవ్ర గాయాల‌పాల‌య్యారు. సోమ‌వారం ఉద‌యం 9:10 గంట‌ల‌కు గోవింద్ సింగ్, ఆయ‌న స‌తీమ‌ణి క‌లిసి 191 బెటాలియ‌న్ నుంచి రాజ‌స్థాన్‌లోని త‌నోత్ మాతా ఆల‌యానికి వెళ్లారు. ద‌ర్శ‌నం అనంత‌రం రాంగ‌ఢ్‌కు తిరిగి వ‌స్తుండ‌గా, వారి కారు మ‌ధ్యాహ్నం 2:45 గంట‌ల‌కు ప్ర‌మాదానికి గురైంది. గోవింద్ సింగ్, డ్రైవ‌ర్‌ను స‌మీప ఆసుపత్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. అయితే గోవింద్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు వెల్ల‌డించారు.

- Advertisement -