జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ టీఆర్ఎస్కు మద్దుతు పలికింది. తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ 5వ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్…పనిచేసే ప్రభుత్వానికి మద్దతివ్వాలని ప్రజలను కోరారు.
ప్రాధాన్యత క్రమంలో హైదరాబాద్ను అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు కేటీఆర్. బీజేపీ పాలిత ప్రాంతాల్లో గుంతలు లేని రోడ్లను చూపిస్తారా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు.సంస్కరణలు తీసుకొచ్చే క్రమంలో బాలారిష్టాలు తప్పవన్నారు.కష్టపడి సాధించుకున్న రాష్ట్రాన్ని ఇష్టపడి అభివృద్ధి చేయాలన్నారు.
సీఎం కేసీఆర్ అందరిని కడుపులో పెట్టుకుని చూసుకుంటారని తెలిపారు. దేశంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.సీఎం కేసీఆర్ హైదరాబాద్ను స్వచ్ఛ హైదరాబాద్గా మార్చారని తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ను హైదరాబాద్లో ప్రారంభించామన్నారు.
నగరంలో 130 కొత్త లింకు రోడ్లను ప్రారంభిస్తున్నామని తెలిపారు.ధరణి పోర్టల్,టీఎస్ బీపాస్తో రిజిస్ట్రేషన్లు,అనుమతులు సులభతరమయ్యాని చెప్పారు.లంచం ఇచ్చే పరిస్ధితి రావొద్దని ధరణి పోర్టల్ తీసుకొచ్చామన్నారు.ఆరేళ్ల క్రితం హైదరాబాద్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాలన్నారు.