పండగల జాబితా ప్రభుత్వానికి అందజేత..

129
brahmins
- Advertisement -

2020 – 21 రాబోయే శుభకృత్ నామ సంవత్సర పండుగల నిర్ణయాలను తెలంగాణ విద్వత్సభ ఇటీవల నిర్వహించిన విద్వత్సమ్మేళనంలో ఏకగ్రీవంగా చర్చించి నిర్ణయించింది. ఈ పండగల జాబితాను ఈరోజు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ కె.వి.రమణాచారి గారికి రాష్ట్ర దేవదాయ, ధర్మదాయశాఖ కమిషనర్ శ్రీ అనిల్ గారికి అందజేయడం జరిగింది.

తెలంగాణ విద్వత్సభ ఉపాధ్యక్షులు శ్రీమాన్ సంపత్ కుమార్ కృష్ణమాచార్య , ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ దివ్యజ్ఞాన సిద్ధాంతి, కోశాధికారి మరుమాముల వెంకటరమణశర్మ ప్రతినిధులు కమలాకర శర్మ బోర్పట్ల విరాట్ స్వరూప్ ఈ పండగల జాబితాను అందజేసిన ప్రతినిధి వర్గం లో ఉన్నారు.

- Advertisement -