డబ్బే డబ్బు: కోట్ల రూపాయలుస్వాధీనం

231
ts elections
- Advertisement -

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాష్ట్రవ్యాప్తంగా భారీగా నగదు పట్టుబడుతోంది. రేపటితో ప్రచారం ముగియనుండగా ఒక్కరోజే కోట్ల రూపాయల్లో నగదు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది.

జనగామ జిల్లా పెంబర్తి చెక్‌పోస్టు దగ్గర అధికారులు తనిఖీలు చేపట్టగా ఓ కారులో తరలిస్తున్న రూ.6కోట్ల నగదును సీజ్ చేశారు. ఏపీ 37 సీకే 4985 నెంబరు గల కారును స్వాధీనం చేసుకున్నారు. అటు మంచిర్యాలలో ట్రాలీలో పైపు మాటున తరలిస్తున్న రూ.50లక్షలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి సమీపంలో తనిఖీలు చేపట్టగా రూ. 1.17లక్షలు పట్టుబడ్డాయి.

పలుచోట్ల నగదు తరలిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు పట్టుబడ్డారు. పెంబర్తి చెక్ పోస్ట్ దగ్గర పట్టుబడిన డబ్బులు ఖమ్మం కూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు, వరంగల్ ఈస్ట్ అభ్యర్థి గాయత్రీ రవి, పరకాల అభ్యర్థి కొండా సురేఖకు చెందినవిగా పోలీసులు, ఎన్నికల అధికారులు అనుమానిస్తున్నారు.

- Advertisement -