టీఆర్ఎస్‌లోకి రాజారాం యాదవ్

379
RajaRam Yadav
- Advertisement -

ఓయూ జేఏసీ నేత,కాంగ్రెస్ లీడర్ రాజారాం యాదవ్ టీఆర్ఎస్‌లో చేరారు. నిజామాబాద్‌లో ఎంపీ కవిత సమక్షంలో గులాబీ తీర్థం పుచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజారాం మహాకూటమి ఓటమి ఖాయమన్నారు. ఓడిపోతామని మహాకూటమి నేతలకు తెలిసినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని తెలిపారు.

కూటమి ఓయూ జేఏసీ నేతలకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం కృషిచేస్తానని తెలిపారు. టీఆర్ఎస్‌లో చేరడం నా సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని తెలిపారు. నాడు తెలంగాణ ఉద్యమంలో నేడు బంగారు తెలంగాణ సాధనలో సీఎం కేసీఆర్ కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు.

అన్నివర్గాలకు సముచిత స్ధానం కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. గొల్ల,కురుమల అభివృద్ధికి రూ. 5 వేల కోట్లు కేటాయించారని చెప్పారు. కేసీఆర్‌తోనే సామాజిక న్యాయం సాధ్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు అధికార కాంక్ష తప్ప పాలించడం చేతకాదన్నారు.

- Advertisement -