రాష్ట్రంలో కొత్తగా 206 కరోనా కేసులు నమోదు..

129
COVID 19
- Advertisement -

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి భారీగా తగ్గుముఖం పట్టింది. తాజాగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 206 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 346 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,91,872 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,86,244 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,579కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 4,049 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 2,281 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 45 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.

- Advertisement -