7 ఎమ్మెల్సీ స్ధానాలకు నోటిఫికేషన్‌ రిలీజ్..!

172
ts
- Advertisement -

రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణమైన వెలువడే అవకాశం ఉంది. శాసనమండలిలో త్వరలో 7 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానుండగా ఎమ్మెల్యే కోటాలో జూన్ 3 వ తేదీతో ముగుస్తున్న 6 గురు ఎమ్మెల్సీల గడువు ముగియనుంది.

గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్,కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలిత, బోడకుంటి వెంకరేశ్వర్లు పదవీ కాలం ముగియనుండగా ఈ 6 స్థానాలకు ఏ క్షణమైనా కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.గవర్నర్ కోటాలో మరో ఎమ్మెల్సీ ప్రొ శ్రీనివాస్‌ రెడ్డి పదవీ కాలం జూన్ 16తో ముగియనుండగా ఈ ఏడు స్ధానాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది.

- Advertisement -