వైరల్ : ఒకే వేదికపై మహేష్ , బన్నీ

86
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య రెండేళ్ళ క్రితం బాక్సాఫీస్ పోటీ జరిగింది. సరిలేరు నీకెవ్వరు తో మహేష్ , అల వైకుంఠపురములో తో బన్నీ ఆ ఏడాది సంక్రాంతి పోటీలో నిలిచారు. రెండు సినిమాలు మంచి వసూళ్ళు రాబట్టాయి. కానీ మహేష్ పై బన్నీ ఆ ఏడాది పై చేయి సాదించి ఇండస్ట్రీ హిట్ కొట్టి అల వైకుంఠపురములో తో కొత్త రికార్డ్ నెలకొల్పాడు.

అయితే ఆ రెండు సినిమాలు కలెక్షన్స్ తో బాగా పోటీ పడ్డాయి. మహేష్ , బన్నీ ఇద్దరూ ఆ పోటీను సీరియస్ గా తీసుకున్నారు. ఆ టైంలో వీరిద్దరి మధ్య నువ్వా నేనా అనే రైవల్రీ నడిచింది. ఆ తర్వాత ఈ ఇద్దరు కలిసింది లేదు. తాజాగా కృష్ణ మరణం రోజు మహేష్ ను పరామర్శించాడు బన్నీ. ఇక నిన్న రాత్రి దర్శకుడు గుణ శేఖర్ కూతురు నీలిమ గుణ రిసెప్షన్ లో ఈ ఇద్దరూ కలిసి ఒకే స్టేజి పై కనిపించి ఫ్యాన్స్ ని ఖుషి చేశారు.

ఈ వేదికపై మహేష్ తో బన్నీ గానీ అల్లు అర్జున్ తో మహేష్ కానీ సాన్నిహిత్యంగా కనిపించలేదు. జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు అంతే. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంది కూడా లేదు. బన్నీ వేదికపైకి వచ్చిన కొన్ని నిమిషాలకే మహేష్ స్టేజి దిగిపోయాడు. ఏదేమైనా మహేష్ , బన్నీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకునే విజువల్స్ మాత్రం అందించలేకపోయారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -