ఆసియా కప్‌కు టీమిండియా జట్టు ఇదే

19
- Advertisement -

ఆసియా కప్‌కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. 17 మందితో కూడిన జట్టును ప్రకటించగా కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవరహించనున్నారు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కు మళ్లీ స్థానం దక్కగా తిలక్ వర్మ జట్టులో స్థానాన్ని సంపాదించాడు. ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియాకప్ జరగనుంది. పాకిస్థాన్, శ్రీలంక వేదికల్లో టోర్నీ జరగబోతోంది. సెప్టెంబర్ 2న శ్రీలంకలోని పల్లెకెలెలో భారత్ – పాకిస్ధాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.

ఆసియా కప్ జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. సంజు శాంసన్ స్టాండ్ బై ప్లేయర్.

Also Read:ఆ కుర్ర దర్శకుడికి ఆమె కావాలట

- Advertisement -