ఐపిఎల్ కు దూరంగా బుమ్రా…

880
bumra
- Advertisement -

టీంఇండియా ఫేస్ బౌలర్ జ‌స్ ప్రిత్ బుమ్రా ఐపిఎల్ కు దూరంగా ఉండ‌నున్నాడు. ఐపిఎల్ త‌ర్వాత వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ లు స‌మీపిస్తుండ‌టంతో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్లుకు చెందిన పలువురు కీలక ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరం కానున్న సంగతి తెలిసిందే.ఈసంద‌ర్బంగా ప‌లు టీంల‌లో కీల‌క బౌల‌ర్లకు విశ్రాంతి క‌ల్పించాలాని నిర్ణ‌యించారు. ఇదే త‌ర‌హాలో ఇండియాకు చెందిన మెయిన్ బౌల‌ర్ బుమ్రాకు కూడా విశ్రాంతి క‌ల్పించాల‌ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా బీసీసీఐ కి సూచించాడు.

kohli bumra

కోహ్లీ సూచ‌న‌పై దృష్టి సాధించిన బోర్డు స‌భ్యులు ఇప్పుడు అదే విష‌యంపై ఆలోచిస్తున్నారు. కీలక బౌలర్లకు ఐపీఎల్‌ నుంచి విశ్రాంతి కల్పించాలనే యోచనలో ఉన్నారు. బుమ్రా ప్ర‌స్తుతం ముంబై ఇండియ‌న్స్ నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు. ముంబై టీం లో బుమ్రా మెయిన్ బౌల‌ర్ కావ‌డంతో టీం కు న‌ష్టం వాటిల్ల‌వ‌చ్చ‌ని ఆలోచిస్తున్నారు ముంబై టీం యాజ‌మాన్యం. త్వరలోనే ముంబై ఇండియన్స్‌ యాజమాన్యంతో బీసీసీఐ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బుమ్రా ఫిట్‌గా ఉంటే కీలక మ్యాచ్‌ల్లో ఆడించి మిగతా మ్యాచ్‌ల్లో విశ్రాంతి కల్పించాలని బీసీసీఐ ఆలోచన చేస్తోంది.

- Advertisement -