పేదవాడి సొంతింటి కల సాకారం కోసం టిడిపి నిరసన దీక్ష..

48
- Advertisement -

పేదవాడి సొంతింటి కల సాకారం కోసం అంటూ అనంతపురం కలెక్టర్ కార్యాలయం వద్ద అనంతపురం టిడిపి నాయకులు మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి నిరసన దీక్షకు దిగారు. తెలుగుదేశం ప్రభుత్వం పేదల కోసం టిడ్కో భావనా ల నిర్మాణం చేపట్టి 80 శాతం పూర్తి చేసిందని, వైసిపి పాలకులు వాటిని పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రభాకర్ చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వాటిని వెంటనే పూర్తి చేసి పేదలకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చేసిన ఆందోళనకు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మద్దతు పలికారు. ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్యే ఉన్నము హనుమంతరయ చౌదరి పాల్గొన్నారు.

- Advertisement -