టీడీపీ అధినేత,మాజీ సీఎం చంద్రబాబుకు షాకిచ్చారు ఆ పార్టీ క్రిస్టియన్ సెల్ నాయకులు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు ప్రవీణ్. టిడిపి లో ఎంతో కాలంగా ఉండి పార్టీ కోసం పని చేస్తున్నాం…చంద్రబాబు 5వ తేదీన చేసిన వ్యాఖ్యలు మమ్మలను బాధించాయని తెలిపారు.
క్రైస్తవ సమాజాన్ని అవమానించే విధంగా మాట్లాడారు….ఆయన ఎప్పుడూ ఇలాంటి మాటలు గతంలో చేయలేదని తెలిపిన ప్రవీణ్…ఆ మాటలుతో క్రైస్తవులు మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిపారు. గతంలో మీరు అనేక సార్లు చర్చిలో మీరు ప్రార్ధనలు కూడా చేశారు….మసీదులకు వెళ్లి నమాజ్ చేసి శుభాకాంక్షలు చెప్పలేదా అని ప్రశ్నించారు.
లౌకిక దేశంలో అన్ని మతాల వారు… అన్ని పండుగలలో పాల్గొంటారని తెలిపిన ప్రవీణ్…చర్చి ఫాదర్ లకు ఐదువేల రూపాయలు ఇస్తే… తప్పు పట్టడం దేనికని చెప్పారు. టీడీపీ మేనిఫెస్టోలో కూడా అనేక పధకాలు పెట్టలేదా….మత మార్పిడి విషయంలో కూడా క్రిస్టియన్ లను అవమానించారని చెప్పారు. బలవంతంగా మతమార్పిడులు చేస్తున్నట్లు నిరూపించాలన్నారు. గ్రామాలలో చర్చిలు ఎప్పటి నుంచో ఉన్నాయి….ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు చెప్పడం సరికాదన్నారు.
గతంలో క్రైస్తవుల కు మీరు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని తెలిపిన ప్రవీణ్..మేము మీ అభివృద్ధి కోసం పనిచేస్తే… మమ్మలను ఇలా బాధ పెట్టడం సరి కాదన్నారు.క్రైస్తవులు పై ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన ప్రవీణ్…టిడిపి క్రిస్టియన్ సెల్ ప్రతినిధులు అంతా పార్టీ కి మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నాం అన్నారు.