లండన్‌లో టాక్ 5వ వార్షికోత్సవ సమావేశం

55
tauk
- Advertisement -

తెలంగాణ అస్సోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) 5 వ వార్షికోత్సవ సమావేశాన్ని లండన్ లో నిర్వహించుకున్నారు.టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో టాక్ కార్యవర్గ సభ్యులంతా హాజరయ్యారు.టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ, సంస్థ ఆవిర్భావం నుండి నేటి వరకు ఎంతో కృషి చేసి విజయవంతంగా ఐదు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా కార్యవర్గసభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సహకరించి ప్రోత్సహిస్తున్న స్థానిక ప్రవాసులకు, ప్రవాస సంస్థలకు, స్థానిక యూకే రాజకీయ నాయకులకు, ప్రభుత్వ సంస్థలకు, తెలంగాణ సమాజానికి, తెలంగాణ నాయకులకు, మీడియా సంస్థలకు, జర్నలిస్టులకు, శ్రేయోభిలాషులకు రత్నాకర్ కృతఙ్ఞతలు తెలిపారు.

టాక్ కార్యవర్గ సభ్యుల నిర్విరామ కృషి వల్లే నేడు సమాజ సేవలో 5 సంవత్సరాలు విజయవంతంగా ముగించుకొని, అదే నిబద్దతతో ముందుకు వెళ్తున్నామని, వారందరికీ కృతఙ్ఞతలు తెలిపారు.ఇటీవల బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ గారు టాక్ సంస్థను అభినందించడం మనందరికీ గర్వకారణమని, బతుకమ్మ వేడుకల్లో జరిగిన విశేషాలని మహారాణి దృష్టికి తీసుకెళ్లిన చిరంజీవి నిత్యశ్రీ కూర్మాచలం ని, అలాగే బతుకమ్మ వేడుకల్లో విన్నూతంగా లండన్ టవర్ బ్రిడ్జ్ ఏర్పాటుకు కృషి చేసిన మల్లా రెడ్డి – శుష్మణ రెడ్డి దంపతులని రత్నాకర్ కడుదుల ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక ప్రభుత్వం రోజు రోజుకు కోవిడ్ – 19 నిబంధనలను సడలిస్తున్నందున, ఈ సంవత్సరం పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందనే ఆలోచనతో, టాక్ – 2022 ఈవెంట్స్ క్యాలెండర్ ని టాక్ కార్యవర్గ సభ్యులు ఆవిష్కరించారు.

టాక్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి శుష్మణ రెడ్డి మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర పండుగలు బోనాలు మరియు బతుకమ్మను ఘనంగా నిర్వహించేందుకు తేదీలను కూడా ప్రకటించారు.లండన్ బోనాల జాతర – ౩ జులై 2022..టాక్ చేనేత బతుకమ్మ – దసరా సంబరాలు – 01 అక్టోబర్ 2022.యూకే లో నివస్తిస్తున్న ప్రవాస కుటుంబసభ్యులంతా ఈవెంట్ తేదీలను గుర్తుంచుకొని హాజరై టాక్ సంస్థ కృషిని ప్రోత్సహించి, మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చెయ్యాలనే సంకల్పంలో బాగస్వాములవ్వాలని శుష్మణ రెడ్డి కోరారు.

టాక్ సంస్థ నిర్వహించే రెండు పండగలు మన ఆడబిడ్డల క్రియాశీలక భాగస్వామ్యంతోనే విజయవంతం చేసుకోగలమని, కాబట్టి యూకే లో నివసిస్తున్న ఆడబిడ్డలంతా ముందుకు వచ్చి ఈ వేడుకల్లో పాల్గొనడమే కాకుండా టాక్ సంస్థ లో కూడా భాగస్వాములై ఇతర సామాజిక, సాంస్కృతిక, సేవ కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని శుష్మణ రెడ్డి కోరారు.సంస్థ ఆవిర్భావం నుండి నేటి వరకు టాక్ సంస్థను ప్రోత్సహించి ఆశీర్వదిస్తున్న ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి శుష్మణ రెడ్డి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

టాక్ జాతీయ కన్వీనర్ అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ , ఇటీవల దాదాపు రెండు మూడు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుండి యూకే కి ఎంతో మంది విద్యార్థులు వస్తున్నారని, వారంతా మన కుటుంబసభ్యులేనని కొత్తగా వచ్చినప్పుడు వారంతా స్థిరపడే వరకు కావలసిన ప్రాధమిక సమాచారాన్ని సహాయాన్ని అందించేవిధంగా టాక్ సంస్థ ప్రాణాలిక రూపొందించడమే కాకుండా ప్రత్యేక టాక్ యువజన విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తునట్టు అశోక్ తెలిపారు.

టాక్ కమ్యూనిటీ అఫైర్స్ చైర్ పర్సన్ నవీన్ రెడ్డి మాట్లాడుతూ, టాక్ సంస్థ కేవలం సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా ఇటు క్రీడా , సేవ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుందని, సంస్థలో బాగస్వాములయ్యే వారు tauk.org@gmail.com ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు లేదా www.tauk.org.uk వెబ్ సైట్ ద్వారా సభ్యత్వ నమోదు చేసుకోవచ్చని నవీన్ రెడ్డి తెలిపారు.సమావేశంలో హాజరైన టాక్ కార్యవర్గసభ్యులు కేక్ కట్ చేసి 5 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ సమావేశంలో టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల , ఉపాధ్యక్షులు శుష్మున రెడ్డి మరియు సత్య చిలుముల, కన్వీనర్ అశోక్ కుమార్ ధూసరి, ఇతర నాయకులు నవీన్ రెడ్డి,జాహ్నవి, మల్లా రెడ్డి,ప్రవీణ్ కుమార్ వీర,సెరు సంజయ్,రవి రెటినేని,సుప్రజ, సత్యపాల్, శ్రీకాంత్ జెల్ల,హరిబాబు,శ్రీ విద్యా,రాజేష్ వర్మ,అవినాష్,నవీన్ కుమార్,రంజిత్,క్రాంతి,శ్రీ శ్రావ్య,శైలజ,వంశీ,పృథ్వీ ,శశిధర్ తదితరులు పాల్గొనావారిలో ఉన్నారు.

- Advertisement -