తమిళనాడులో మరో ముగ్గురికి కొత్త వైరస్

169
corona
- Advertisement -

దేశంలో కొత్త తరహా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. యుకే రిటర్న్స్‌లో చాలామందికి కరోనా పాజిటివ్ రావడం అందరిని కలవరపెడుతోంది. ఇప్పటివరకు 44 మందికి కొత్త తరహా వైరస్ రాగా తాజాగా మరో ముగ్గురికి పాజిటివ్‌గా తేలింది. బ్రిటన్‌ నుండి తమిళనాడుకు వచ్చిన వారిలో కొత్త వైరస్ లక్షణాలను గుర్తించారు. దీంతో తమిళనాడులో కేసుల సంఖ్య 4కు చేరింది.

వారందరిని నగరంలోని కింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స అందిస్తున్నామని అధకారులుచెప్పారు. బ్రిటన్ రిటర్న్స్‌లో 12 మంది నమూనాలను పుణె వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించామని…. వారికి సంబంధించిన ఫలితాలు ఇంకా తెలియాల్సి ఉందని వైద్యశాఖ అధికారులు తెలిపారు.

బర్డ్‌ ఫ్లూకి సంబంధించి రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో పరిస్థితులను పశుసంవర్ధకశాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని చెప్పారు. బర్డ్‌ఫ్లూ కేసులు నమోదవుతుండటంతో కేరళ సరిహద్దుల్లో ఉన్న కన్యాకుమారి, టెన్‌కాశి, థేని, తిరుప్పూర్‌, కోయంబత్తూరు, నిలగిరి జిల్లాల సరిహద్దులను అధికారులు మూసివేశారు.

- Advertisement -