వైకోపై తమిళనాడు సీఎం ప్రశంసలు

4
- Advertisement -

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ..ఎండీఎంకే అధినేత వైకోపై ప్రశంసలు గుప్పించారు. ఎండీఎంకే వ్యవస్థాపకుడు వైకో ఇవాళ తిరుచిరాపల్లి నుంచి ‘సమత్వ నడై పయనం’ (సమానత్వం కోసం పాదయాత్ర) ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన స్టాలిన్‌..వైకో చేసిన సేవలను ప్రశంసించారు.

వైకో తన ప్రజా జీవితంలో అడుగుపెట్టని ప్రాంతం తమిళనాడులో దాదాపు లేదనే చెప్పాలి అన్నారు స్టాలిన్. ప్రజల సమస్యలను వెలుగులోకి తేవడానికి ఆయన నిరంతరం పాదయాత్రలు చేశారు. 82 ఏళ్ల వయస్సులోనూ వైకోలోని శక్తి, ఉత్సాహం యువకుడిని తలపిస్తుంది. ఇలాంటి పాదయాత్రలు ప్రజల వద్దకు ఆలోచనలను నేరుగా తీసుకెళ్లడంలో, సామాన్యుల్లో అవగాహన పెంచడంలో ఎంతో ప్రభావవంతంగా ఉంటాయి.

ఇటీవల మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్న సంఘటనలు, ముఖ్యంగా తిరునెల్వేలిలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా జరిగిన దాడులు క్రైస్తవులు, ముస్లింలలో భయాన్ని కలిగించాయి. ప్రేమను బోధించాల్సిన ఆధ్యాత్మికతను కొంతమంది గుంపులు అశాంతి రెచ్చగొట్టేందుకు దుర్వినియోగం చేస్తున్నారు అన్నారు.

Also Read:పోలీసుల అదుపులో మావోయిస్టు దేవా!

 

- Advertisement -