ఉగాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి: గవర్నర్

236
tamilisai
- Advertisement -

‘శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది’ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో నివసిస్తున్న తెలుగు వారందరికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

తెలుగు ప్రజలందరూ ఈ ఉగాది పండుగను ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను.శ్రీ ప్లవ నామ సంవత్సరం తెలుగు వారందరి జీవితాలలో వెలుగులు నింపాలని, ఈ సంవత్సరం అంతా ప్రజలందరికీ మహమ్మారి రహిత ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాను. కరోనా మహమ్మారిని అత్యంత ధైర్య సాహసాలతో ఎదుర్కొని విజయం సాధించాలని హృదయ పూర్వకంగా ఆశిస్తున్నాను . ఈ నూతన సంవత్సరంలో మనం, మన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులందరు ప్రభుత్వం సమయానుసారం ఇచ్చే అన్ని సూచనలను పాటిస్తూ ఆరోగ్యంగా ఉందామనే సంకల్పం తీసుకొందాం అని పిలుపునిచ్చారు.

- Advertisement -