తమిళనాడులో మరో వారం పాటు లాక్ డౌన్ పొడిగింపు..

194
Tamil Nadu
- Advertisement -

కరోనా కట్టడి దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో వారం పాటు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు సీఎం స్టాలిన్ ఓ ప్రకటనలో తెలిపారు. మే 24 నుంచి ఈ పొడిగింపు అమల్లోకి వస్తుంది. ఇంతకుముందు మే 10 నుంచి 24వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించడం తెలిసిందే. మరో రెండ్రోజుల్లో ఆ లాక్ డౌన్ ముగియనుండడంతో సీఎం స్టాలిన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై చర్చించారు. వైద్య, ఆరోగ్య నిపుణులు రెండు వారాలు కఠిన లాక్ డౌన్ విధించాలని సూచించారు.

ఎలాంటి మినహాయింపులు లేకుండా పకడ్బందీగా లాక్ డౌన్ విధించాలని, అప్పుడే కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తుందని స్టాలిన్‌ అభిప్రాయపడ్డారు. కాగా, తమిళనాడులో నిన్న వెలువడిన బులెటిన్ లో 36,184 కేసులు, 467 మరణాలు నమోదైనట్టు పేర్కొన్నారు. గత నాలుగు రోజుల నుంచి కేసులు పెరుగుతుండడంతో డీఎంకే సర్కారు అప్రమత్తమైంది. తాజా లాక్ డౌన్ లోనూ అత్యవసర సర్వీసులకు మినహాయిపునిచ్చారు.

- Advertisement -