కేటీఆర్‌పై వ్యాఖ్యలు చేసేవాళ్లు తమ స్థాయి తెలుసుకొని మాట్లాడాలి..

123
Talasani Srinivas Yadav copy
- Advertisement -

హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌,గంగుల కమలాకర్‌ మరియు టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యులు కె కేశవ రావుతో కలిసి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణి దేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..ఇక విద్యావంతులుగా.. విద్యావంతురాలికే పట్టం కడదామని.. హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణీ దేవినే గెలిపిద్దామని మంత్రి తలసాని కోరారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చర్చకు రావాలంటూ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసరడంపై తలసాని ఘాటుగా స్పందించారు. ఎవడు పడితే వాడు గన్ పార్క్ వద్ద చర్చకు రమ్మంటే కేటీఆర్ వస్తాడా? అని వ్యాఖ్యానించారు. చర్చకు రమ్మని అడగడానికి ఓ స్థాయి ఉండాలని అన్నారు. కేటీఆర్ పై వ్యాఖ్యలు చేసేవాళ్లు తమ స్థాయి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. గత ప్రభుత్వాలు ఉద్యోగాల కల్పనలో విఫలమైతే, టీఆర్ఎస్ ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేసిందని తలసాని అన్నారు.

- Advertisement -