ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలి..

159
talasani
- Advertisement -

కరోనా మహమ్మారితో రాష్ట్ర ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కాప్రా సర్కిల్ ఏఎస్ రావు నగర్ డివిజన్.. జై జవాన్ నగర్‌లో వెయ్యి మంది పేదలకు నిత్యావసరాలను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డిలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగ వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలని, మే 7వరకు చేసిన లాక్‌డౌన్‌ను అందరూ పాటించాలన్నారు. అలాగే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణాలోని పేదలకు అన్నివిధాలా ఆదుకోడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.

- Advertisement -