టీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్ర పండుగగా బోనాలు:తలసాని

422
talasani
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బోనాలకు మంచి గుర్తింపు వచ్చిందని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సీఎం కేసీఆర్ చూపించిన చొరవతో బోనాల పండగ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. బోనాల పండుగకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

స్వరాష్ట్రంలో రాష్ట్ర పండుగగా బోనాలకు గుర్తింపు వచ్చిందన్నారు. బోనాలను ఘనంగా నిర్వహించుకునేందుకు దేవాలయాలకు నిధులు విడుదల చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. బోనాలు,రంగం,ఫలహారం బండి ఊరేగింపు ఇలా ప్రతి ఒక్కటిని మీడియా సైతం ప్రపంచవ్యాప్తంగా చూపిస్తోందన్నారు. ప్రజలు, అధికారుల సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు.

జీహెచ్‌ఎంసీ తరపున అన్ని వసతలు కల్పించామని చెప్పారు కమిషనర్ దాన కిశోర్‌. 15వ తేదీ వరకు జీహెచ్‌ఎంసీ సిబ్బందితో మొత్తం పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ సంవత్సరం కూడా బోనాల పండుగ సందర్భంగా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు.

- Advertisement -