ష‌ట్ల‌ర్‌కు క‌రోనా..!

278
coronavirus
- Advertisement -

ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్‌షిప్‌లో పాల్గొన్న తైవాన్ ప్లేయర్‌కు క‌రోనా వైర‌స్ సోక‌డంపై భారత ప్లేయ‌ర్లు షాక్‌కు గుర‌య్యారు. తైవాన్‌కు చెందిన ప‌దేళ్ల ప్లేయ‌ర్‌కు క‌రోనా వైర‌స్ సోకింద‌ని హెచ్‌కే విట్టింగ‌స్ తెలిపాడు. ఈ నేపథ్యంలో భారత ప్లేయర్లు షాక్‌కు గురయ్యారు.

ఈనెల 11 నుంచి 15 వ‌ర‌కు ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్‌షిప్ జ‌రుగగా ఈ టోర్నీలో సైనా,పీవీ సింధు తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సైనాతో పాటు అశ్విని పొన్న‌ప్ప‌, అజ‌య్ జ‌య‌రామ్, పారుపల్లి కశ్యప్ తదిత‌రులు విచారం వ్య‌క్తం చేశారు.

ఇక ఇప్పటికే కరోనా కారణంగా అనేక రంగాలు కుదేల‌య్యాయి. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌, షూటింగ్ ప్ర‌పంచ‌క‌ప్ స‌హా ఎన్నో టోర్నీలో వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇండియాలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 200 దాటిపోయింది.

- Advertisement -