నేను చేసిన సినిమాల‌న్నింటిలోకీ యంగెస్ట్ హీరోలు వీరే- తాప్సీ

75
- Advertisement -

బాలీవుడ్‌ బ్యూటీ తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయఫేమ్ స్వరూప్ ఆర్‌.ఎస్‌.జె. ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరించారు. ముగ్గురు పిల్ల‌లు గా రోష‌న్‌, బానుప్ర‌కాష్, జైతీర్థ న‌టించారు. ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుద‌ల కాబోతుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారంనాడు ప్రీరిలీజ్ వేడుక హైద‌రాబాద్‌ లోని ఓ హోట‌ల్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మెగా గెస్ట్‌ గా మెగాస్టార్ చిరంజీవి హాజ‌ర‌య్యారు.

ఈ కార్యక్రమంలో తాప్సీ ప‌న్ను మాట్లాడుతూ, ఝుమ్మంది నాదం సినిమా ఆడియోకు చిరంజీవి వ‌చ్చారు. నాకు స్పెష‌ల్ మూవీ. ఆయ‌న ఆశీస్సులు మ‌రోసారి ద‌క్కాయి. నిరంజ‌న్‌రెడ్డి నాకు ఘాజి సినిమాలో అవ‌కాశం ఇచ్చారు. ఈ సినిమా నాకు హ్యాట్రిక్ మూవీ కావాలి. ద‌ర్శ‌కుడు స్వ‌రూప్ చాలా స‌పోర్ట్ చేశారు. నా డేట్స్‌, ప్ర‌యాణం వ‌ల్ల ఇబ్బందులున్నా ఎంతో స‌హ‌క‌రించారు. ఈ సినిమాకు ముగ్గురు పిల్ల‌లే హీరోలు. నేను చేసిన సినిమాల‌న్నింటిలోకీ యంగెస్ట్ హీరోలు వీరే. నేను రెండేళ్ళుగా హిందీలో బిజీగా వున్నా తెలుగులో చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏమిటంటే లాజిక్ గా ఏమీ చెప్ప‌లేను. నేను తెలుగులో చేశాను. చేస్తాను. చేస్తూనే వుంటాను అని తాప్సీ తెలిపారు.

చిత్ర ద‌ర్శ‌కుడు స్వరూప్ ఆర్‌.ఎస్‌.జె మాట్లాడుతూ, చిరంజీవిగారు మా సినిమాకు స‌పోర్ట్ చేయ‌డానికి వ‌చ్చినందుకు థ్యాంక్స్‌. ట్రైల‌ర్ ను విడుద‌ల చేసిన మ‌హేష్‌బాబుకు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నా. నేను చేసిన ఏజెంట్‌.. సినిమాకు స్పూర్తి చిరంజీవిగారి చంట‌బ్బాయ్‌. నేను చిరంజీవిగారి అభిమానిని. తిరుప‌తిలో సినిమాలు వ‌స్తే క‌టౌట్లు క‌ట్టేవాడిని. ఇక ఈ సినిమా తెర‌రూపం రావ‌డానికి కార‌ణం నిర్మాత‌లే. కోవిడ్ మొద‌టివేవ్‌లో క‌థ చెప్పాను. అప్ప‌డు థియేట‌ర్లు ఓపెన్ అవుతాయో లేవో అనే గంద‌ర‌గోళం నెల‌కొంది. అలాంటి స‌మ‌యంలో ముగ్గురు పిల్ల‌ల క‌థ వెండితెర‌పై చూపాల‌న్న నిర్మాత ఆలోచ‌న‌తో ముందుకు సాగారు. ఈ క‌థ రీత్యా స్ట్రాంగ్ హీరోయిన్ కావాల‌నుకున్నాం. తాప్సీగారు హిందీలో పింక్‌వంటి అద్భుత‌మైన సినిమాలు చేశారు.. ఆమె ఈ క‌థ‌లో 45 నిముషాలు మాత్ర‌మే వుంటుంది. అనుమానంగానే ఆమెను ముంబైలో క‌లిశాం. క‌థ విని వెంట‌నే చేస్తాన‌న్నారు. పాత్ర‌లో నిడివికాదు. క‌థ న‌చ్చి అంగీక‌రించారు. షూటింగ్‌లో ఎటువంటి స‌మ‌స్య వున్నా అన్వేష్ రెడ్డిగారు ప‌రిష్క‌రించేవారు.

ఈ సినిమాకు మార్క్‌.కె. రాబిన్ చ‌క్క‌టి BGM తోపాటు సంగీతం బాగా ఇచ్చారు. కెమెరామెన్ దీప‌క్ నాకు బ‌లం. ఆర్ట్ డైరెక్ట‌ర్‌, నా ద‌ర్శ‌కుల టీమ్‌కు ధ‌న్య‌వాదాలు. ఇక ముగ్గురు పిల్ల‌లను ఎంపిక చేసి రెండు నెల‌ల‌పాటు వ‌ర్క్‌షాప్ చేశాం. ఆ వ‌య‌స్సులో వున్న కాన్ఫిడెన్స్ నాకు బాగా ఉప‌యోగ‌ప‌డింది. ఈ సినిమా త‌ర్వాత ఈ ముగ్గురికీ మంచి పేరువ‌స్తుంది. కోవిడ్ టైంలో వారి త‌ల్లిదండ్రులు మ‌మ్మ‌ల్ని న‌మ్మి పంపించారు. ఏప్రిల్ 1న సినిమా విడుద‌ల‌వుతుంది. ఇది చిన్న పిల్లల సినిమాకాదు. పెద్ద‌ల్లోనే చిన్న పిల్ల‌ల అమాయ‌క‌త్వం వుంటుంది. మ‌నం పెద్ద‌య్యాక మ‌న‌కు ఆరోజులు గుర్తుకు వ‌స్తాయి. ఈ సినిమా బాల్యంలోకి తీసుకెళుతుంది. మంచి సినిమా చూసిన‌ రెండుగంట‌లూ న‌వ్వేలా వుంటుంద‌ని హామీ ఇస్తున్నాను అన్నారు

నిర్మాత‌ల్లో ఒక‌రైన నిరంజ‌న్ రెడ్డి మాట్లాడుతూ, మ‌హేష్‌బాబు ట్రైల‌ర్ లాంచ్ చేసినందుకు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నా. చిరంజీవిగారు రావ‌డం స‌క్సెస్‌ గా భావిస్తున్నాం. స్వ‌రూప్ చేసిన మొద‌టి సినిమా చూడ‌లేదు. ఏజెంట్‌.. పెద్ద టైటిల్ ఏమిటి? అని మొద‌ట అనిపించింది. నా స్నేహితులు బాగుంద‌ని చెప్పారు. సినిమా చూశాక ద‌ర్శ‌కుడితో బాగుంద‌ని చెప్పాను. ఏదైనా క‌థ వుంటే ర‌మ్మ‌న్నాను. కథ చెప్పాడు. ఆ క‌థ వింటూనే న‌వ్వుతూనే వున్నాను. ఈ క‌థ స్నేహితుల‌కు చెప్పాను. వారు తెగ‌న‌వ్వారు. ఇలాంటి క‌థ‌కు కీల‌క పాత్ర‌లో తాప్సీ వుంటే బాగుంటుంద‌ని ఆమెకు క‌థ చెప్పాం. ఇప్పుడు మ‌నం పాన్ ఇండియా సినిమా అంటున్నాం కానీ, తాప్సీ పాన్ ఇండియా హీరోయిన్‌ గా ఎప్పుడో అయిపోయింది. మంచి ద‌ర్శ‌కుడు, మంచి యాక్టర్ తోడ‌యితే ఆచార్య‌, మిష‌న్ ఇంపాజిబుల్ వంటి సినిమాలు వ‌స్తాయ‌ని అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు మార్క్‌రాబిన్ మాట్లాడుతూ, స్వ‌రూప్‌తో ఏజెంట్‌.. సినిమా చేశాను. అందుకే క‌ష్టంగా అనిపించ‌లేదు. అవ‌కాశం ఇచ్చిన నిరంజన్ గారికి ధ‌న్య‌వాదాలు. నేను చిరంజీవిగారికి పెద్ద అభిమానిని. ముఠామేస్త్రీలోని పాట‌లు విని ఇంట్లో డాన్స్ వేసేవాళ్లం. ఈ సినిమాలో నాలుగు పాటలున్నాయి. కృష్ణ‌, హసిత్ గోలి, ఎ.కె. గ‌ణేష్‌.. చ‌క్క‌టి సాహిత్యం ఇచ్చారు. ఇందులో ముగ్గురు పిల్ల‌లు బాగా న‌టించారు. వీరికి పెద్ద కెరీర్ వుంటుందని భావిస్తున్నాన‌ని అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో వినోద్‌, మ‌హ‌, ర‌వీంద‌ర్ విజ‌య్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, సుహాస్, సందీప్ రాజ్‌, కెమెరామాన్ దీప‌క్‌, రాహుల్ యాద‌వ్ పాల్గొన్నారు. ఇందులో న‌టించిన బాల న‌టులు రోష‌న్‌, బానుప్ర‌కాష్, జైతీర్థమెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోని పాట‌ల‌కు అనుగుణంగా డాన్స్ చేసి అల‌రించారు. అనంత‌రం మెగాస్టార్ ఆశీర్వ‌చ‌నాలు పొందారు.

- Advertisement -