ఉచిత విద్యుత్ సరఫరాపై కేంద్రం కుట్రలు- మంత్రి జగదీష్ రెడ్డి

73
- Advertisement -

తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర సంస్థలు ఋణాల నిలిపివేతపై రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోజురోజుకీ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కి తుగ్గట్టుగా సరఫరాకి అన్ని ఏర్పాట్లు చేసామన్నారు. 17000mw పైగా విద్యుత్ డిమాండ్ వచ్చినా సరఫరాకు సిద్ధంగా ఉన్నామని.. తెలంగాణ ఉచిత విద్యుత్ సరఫరాపై కేంద్రం కుట్రలు చేస్తుందని మంత్రి విమర్శించారు.

తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో ముందు వరుసలో ఉన్న తెలంగాణాను ప్రోత్సహించాల్సిన కేంద్రం వివక్ష చూపెడుతున్నది. నిరంతరంగా ప్రజలకు విద్యుత్ అందిస్తున్న తెలంగాణా విద్యుత్ ప్రాజెక్టులకు మోకాలడ్డుతుంది కేంద్రం. రాష్ట్రానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ సంస్థల రుణాలను రాకుండా కేంద్రం కుట్రలు చేసింది..తెలంగాణపై కేంద్ర కక్షపూరిత వైఖరిని ఖండిస్తున్నామన్నారు.

కేసీఆర్ వెంట నడుస్తున్న తెలంగాణా రైతుల ఉసురు తీసే కుట్రలు చేస్తున్నది కేంద్రం.రావాల్సిన నిధులపై చట్టప్రకారం పోరాటం చేస్తాం. విద్యుత్ అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో.. ఇతర సంస్థలు తెలంగాణకు విద్యుత్ అమ్మొద్దని బెదిరిస్తున్న కేంద్రం..విద్యుత్ సరఫరాని అడ్డుకుంటూ తెలంగాణా అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటున్నది. కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా.. కేసీఆర్ ఉన్నంత వరకు తెలంగాణా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగనీయడని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ చార్జీల పాపం కేంద్రానిదే. బొగ్గు దిగుమతుల ధరలు, పెట్రో, డీజిల్ చార్జీలు పెరగడంతో పాటు, కేంద్రం అడ్డగోలుగా పన్నులు విధించడం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు పెంచాల్సి వచ్చిందన్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రంపై చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి ప్రజల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -