అభ్యర్థుల ఎంపికపై టీ‘కాంగ్రెస్’ బేటీ..

234
T Congress
- Advertisement -

ఈరోజు హైదరాబాద్‌లోని గోల్కోండ రిసార్ట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ కమిటీలో మొత్తం 41 మంది సభ్యులు ఉన్నారు. ఈ సమావేశానికి టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా, సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, వి.హనుమంతరావు, జానా రెడ్డి, డీకే అరుణ, పొన్నాల ప్రభాకర్, రేవంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

T Congress

ఈ నేపథ్యంలో తెలంగాణలో ‘కాంగ్రెస్’ అభ్యర్థుల ఎంపిక నిమిత్తం పార్టీ సీనియర్ నేతలతో సమాలోచనలో పడ్డారని తెలుస్తోంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు సీట్ల కేటాయింపుపై వారు చర్చించారు. అంతేకాకుండా ఎన్నికలో ప్రచారం, సీట్ల సర్దుబాటుపై చర్చ జరిగింది.

ఎన్నికల్లో గెలిచే అవకాశాలున్న అభ్యర్థుల పేర్లను అదిష్ఠానానికి పంపే యోచనల్లో నేతలు ఉన్నట్లు సమాచారం. అక్టోబర్‌ 10 లోపే అభ్యర్ధులను ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సీట్ల విషయంలో అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో పలువురు సీనియర్‌ నేతలు ఉన్నాట్లు తెలుస్తుంది.

- Advertisement -