ఫిబ్రవరి 4న రానున్న ‘స్వ’..

59
- Advertisement -

జిఎంఎస్ గాలరీ ఫిల్మ్స్ సంస్థలో జీ.ఎం సురేష్ నిర్మాతగా మను పివి దర్శకత్వంలో మహేష్ యడ్లపల్లి, స్వాతి, యశ్వంత్ పెండ్యాల, సిద్దార్థ్ గొల్లపూడి, మానిక్ రెడ్డి ముఖ్య తారాగణంగా నటించిన స్వ చిత్రం ఫిబ్రవరి 4 వ తేదీన ప్రేక్షకుల ముందుకు థియాటర్ల లోనికి రానుంది. ఈ చిత్రానికి సంగీతాన్ని కరణం శ్రీ రాఘవేంద్ర సమకూర్చారు. ఇప్పటికే ఈ చిత్ర ట్రయిలర్ అందర్నీ ఆకట్టుకుంటుండగా కన్నుల్లోన అంటూ సాగే పాటను నిన్న విడుదల చేశారు, ఈ పాట ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. ఈ పాటను వినోద్ శర్మ మరియు నాదప్రియ పాడగా కరణం శ్రీ రాఘవేంద్ర రచించి స్వరపరిచారు.

ఈ చిత్ర నిర్మాత సురేష్ మాట్లాడుతూ.. ఇటీవలే మా ఈ స్వ చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకుని సెన్సార్ బోర్డ్ వారి నుండి మంచి అభినందనలు పొందుకుంది. సినిమాపై పూర్తీ నమ్మకం ఉన్నట్టు ఖచ్చితంగా ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని తెలిపారు.

- Advertisement -