సుష్మాకు కిడ్నీ దొరికింది..

201
Sushma-Swaraj
- Advertisement -

కేంద్ర విదేశీ వ్యవహాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కిడ్నీ సమస్యతో న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. సుష్మా కు కిడ్నీ పూర్తీగా పాడైపోవడంతో..శాస్త్రకిచిత్స ద్వారా కిడ్నీ మార్పిడి చేయాలని..అందుకు కొత్త కిడ్నీ కావాలని వైద్యులు చెప్పారు. దీంతో గత కొంతకాలంగా సుష్మాకు కిడ్నీ దాత కోసం వెతుకులాటలో ఉన్నారు. అయితే సుష్మా స్వరాజ్ కు కిడ్నీ దాత దొరికినట్టు తెలుస్తోంది. ఆమెకు సరిపడే బ్లడ్ గ్రూప్ దాత లభించాడని, ఈ వారాంతంలోనే ఆమెకు కిడ్నీ మార్పిడి జరుగుతుందని ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ దాతకు ఆమెతో ఎలాంటి బంధుత్వమూ లేదని తెలిపారు. ఆమె బంధువర్గం, దగ్గరి స్నేహితులు, అభిమానులు ఎంతో మందిని పరిశీలించినా కిడ్నీ సరిపడలేదని, ఎలాంటి బంధుత్వం లేని వ్యక్తి కిడ్నీ సరిపడిందని తెలిపారు.

Sushma-Swaraj

ఆసుపత్రి ఆధరైజేషన్ కమిటీ నుంచి క్లియరెన్స్ రాగానే సుష్మకు ఆపరేషన్ చేస్తామని, ఇందుకు సంబంధించి ప్రొసీజర్ పూర్తయిందని వివరించారు. ఇద్దరికీ కలిపి చేయాల్సిన పరీక్షలు కూడా చేసి రిపోర్టులను ఉన్నతాధికారులకు అందించామని వెల్లడించారు. ఎయిమ్స్ డాక్టర్లే ఈ శస్త్రచికిత్స చేస్తారని తెలిపారు. కాగా, వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితిలో గత నెల రెండో వారం నుంచి సుష్మా స్వరాజ్ ఆసుపత్రికే పరిమితమైన సంగతి తెలిసిందే. సుష్మాకు కిడ్నీ దానం చేసేందుకు చాలామందే ముందు వచ్చారు. అయితే ఆమెకు సరిపడే బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తిని వైద్యులు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

- Advertisement -