భాగ‌మ‌తి ద‌ర్శ‌కుడితో మెగా హీరో…

218
tej director ashok
- Advertisement -
సుప్రిమ్ స్టార్ సాయి ధ‌ర‌మ్ తేజ్ కు స‌రైన హిట్లు లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. ఆయ‌న ఇటివ‌ల న‌టించిన సినిమాలు వ‌రుస ప‌రాజ‌యం అవ్వ‌డంతో తీవ్ర  నిరాశ‌లో ఉన్నాడు. ఇప్ప‌టి నుంచి ఆయ‌న చేసే సినిమాల‌ను చాలా జాగ్ర‌త్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం తేజ్ నేను శైల‌జ ద‌ర్శ‌కుడు కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో చిత్ర‌ల‌హ‌రి అనే సినిమాను చేస్తున్నాడు. ఈమూవీలో తేజ్ కు జోడిగా క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శిని, నివేదా లు న‌టిస్తున్నారు.  ఈమూవీని ఎప్రిల్ లో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు చిత్ర‌యూనిట్.
Bhagamathi
తేజ్  త‌న త‌ర్వాతి సినిమాను కూడా ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలుస్తుంది. పిల్ల జ‌మిందార్ తో ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్న అశోక్ తో తేజ్ సినిమా చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. అశోక్ ఇటివ‌లే అనుష్క తో భాగ‌మ‌తి సినిమా తీసి మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు. అశోక్ తాజాగా తేజ్ కు క‌థ వినిపించాడ‌ని స‌మాచారం. క‌థ న‌చ్చ‌డంతో తేజ్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని తెలుస్తుంది. ఈమూవీకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే  తెలియ‌నున్నాయి.
- Advertisement -