సచివాలయం కూల్చివేత….రేవంత్‌ రెడ్డికి చుక్కెదురు

175
revanth reddy
- Advertisement -

తెలంగాణ సచివాలయం కూల్చివేత, నిర్మాణంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సచివాలయం కూల్చివేత, నిర్మాణానికి అనుమతి ఇస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టులో పార్టీగా లేనందున పిటిషన్ ను విచారించేందుకు నిరాకరించింది సుప్రీం కోర్టు.

హైకోర్టులో దాఖలైన పిటిషన్ లో మీరు పార్టీగా లేరని పిటిషనర్ ను ప్రశ్నించారు జస్టిస్ అశోక్ భూషణ్. తాము ఎన్జీటీలో దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు తీర్పు ప్రభావం పడిందని కోర్టుకు తెలిపిన పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది రాజ్ పంజ్వాని.ఎన్జీటీలో లేవనెత్తిన అంశాలకు హైకోర్టు తీర్పు అడ్డురాదని పేర్కొన్న సుప్రీం…కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరమా లేదా అన్న అంశం ఎన్జీటీ పరిశీలించవచ్చని తెలిపింది.

- Advertisement -