ఈడీ తీరుపై సుప్రీం చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈడీని దుర్వినియోగం చేస్తున్నారు.. ఈడీ అధికారులు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు అన్నారు.
సోమవారం రెండు కేసులు విచారణ జరుపుతూ ఈడీ పని తీరుపై సంచలన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం. రాజకీయ ప్రయోజనాల కోసం ఈడీ సంస్థను దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు.
ఈడీ అధికారులు అన్ని హద్దులు దాటేస్తున్నారని, రాజకీయ యుద్ధాలలో పావులుగా మరొద్దని అధికారులను హెచ్చరించింది. మీ గురించి ఇంతకంటే కఠినంగా మాట్లాడే పరిస్థితి తెచ్చుకోవద్దని ఈడీకి సూచించింది బీఆర్ గవాయ్ ధర్మాసనం.
ఈడీకి అడ్డుకట్ట వేసేందుకు కొన్ని మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. మరోవైపు ఈడీపై మండిపడింది మద్రాస్ హైకోర్టు. ప్రతీ నేరాన్ని విచారించడానికి ఈడీ సూపర్ పోలీస్ కాదు.. ప్రతీ నేర కార్యకలాపాలపై దాడి చేసేందుకు ఈడీ అధికారులు డ్రోన్లు కాదని మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read:బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోం:పొన్నం

