200 కోట్లతో దూసుపోతున్న ‘దర్బార్’..!

536
- Advertisement -

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌ మురుగదాస్‌ల ఫ‌స్ట్ క్రేజి కాంబినేష‌న్‌లో రూపొందిన ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `దర్బార్`. రజనీ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద వసూళ్లతో అదరగొడుతోంది. తాజాగా ఈ సినిమా రూ.200 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇప్పటి వరకు రజనీ నటించిన సినిమాల్లో నాలుగు సినిమాలు మాత్రమే రూ.200 కోట్ల క్లబ్ లో చేరాయి. వాటిల్లో ‘రోబో’ ‘కబాలి’, ‘2.0’, ‘పేట’ ఉన్నాయి. తాజాగా దర్బార్ ఐదో చిత్రంగా రజనీ ఖాతాలో చేరింది.

Darbar

ఇక ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్ల వసూళ్లు సాధించగా, తమిళనాడులో రూ.80 కోట్లు, కేరళలో రూ.8 కోట్లు, కర్ణాటకలో రూ.19 కోట్లు, హిందీ వెర్షన్ ద్వారా రూ.8 కోట్లు, విదేశాల్లో రూ.70 కోట్లు వసూళ్లను రాబట్టింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మించగా.. రజినీ ఒక ప‌వ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

- Advertisement -