మహేష్ కోసం కథ సిద్దం చేస్తున్న సుకుమార్..!

252
- Advertisement -

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు తన 25వ చిత్రం చేస్తున్నాడు. ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల్లో కొన్ని మినహా.. దాదాపు హిట్లు సాధించాడు ప్రిన్స్. టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహేష్ బాబు, సినిమాలు చేస్తూనే ఫ్యామిలీతో సమయం గుడుపుతుంటాడు. వంశీతో చేస్తున్న సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకూ పూర్తైంది.

వంశీ మూవీ అనంతరం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్. వంశీ సినిమాపై పూర్తైన వెంటనే సుకుమార్ తో జతకట్టేందుకు సిద్దమవుతున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్క్రీప్ట్‌ను కూడా సుకుమార్ వినిపించాడని టాక్. రాజాకార్ల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం.

మహేష్‌కు సెట్టయ్యే కథతో వివాదాలకు తెర లేపకుండా చారిత్రక నేపథ్యంలో మూవీ చేయాలని సుకుమార్ నిర్ణయించుకున్నాడట. ఈ మేరకు రెండు కథలను సిద్దం చేశాడట. ఇక మహేష్ కు ఏ కథ నచ్చితే ఆ కథతోనే సెట్స్ పైకి వెళ్లేందుకు దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్నాడనే వార్తలు రాగానే.. అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

- Advertisement -