- Advertisement -
సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. దిగ్గజ నటుడు, మహేశ్ బాబు తండ్రి కృష్ణ అస్తమించారు. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయన కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందతూ మృతిచెందారు. ఆదివారం శ్వాసకోస సమస్య తలెత్తగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటినుండి డాక్టర్లు చికిత్స అందిస్తుండగా ఆయన పరిస్ధితి విషమంగా ఉందని డాక్టర్లు హెల్త్ బులిటెన్ సైతం విడుదల చేశారు.
ఘట్టమనేని కుటుంబంలో ఈ ఏడాది వరుసగా మరణాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే ఆ ఫ్యామిలీలో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు ఈ ఏడాది జనవరిలో గుండెపోటుతో, నెలన్నర క్రితం ఆయన భార్య ఇందిరా దేవి వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఇప్పుడు కృష్ణ కూడా తీవ్ర అస్వస్థతకు గురై వయసు రీత్యా సమస్యలతో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -