సీఎం చేతుల మీదుగా…8వైద్య కళాశాలలు

266
- Advertisement -

తెలంగాణలోని ప్రతి సామాన్య మానవునికి ఉచిత కార్పొరేట్ వైద్యం అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ జిల్లాకో మెడికల్‌ కాలేజీని స్థాపించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నూతనంగా 8మెడికల్‌ కాలేజీలను ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించ‌నున్నారు.

సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్ కర్నూల్‌, రామగుండంలో మెడికల్ కాలేజీలు మంగళవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా 8మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరమైన ఎంబీబీఎస్‌ క్లాస్‌లు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి.

ఇవి కూడా చదవండి..

తెలంగాణలో మీ కుట్రలు సాగవు:జగదీశ్‌

మంచి మనసు ఉన్న మన కేటీఆర్‌

త్వరల్లో గ్రూప్‌-4 నోటిఫికేషన్:హరీశ్

- Advertisement -