మహేశ్ బాబుతో నితిన్ దర్శకుడు

384
Mahesh Babu Venky kudumula
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. మహేశ్ బాబు తర్వాతి సినిమాపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. వంశీ పైడిపల్లితో సినిమా చేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. ఇదిలా ఉండగా గీత గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి. ఈ గ్యాప్ లో మహేష్ కు మరి కొంతమంది దర్శకులు కూడా స్టోరీ వినిపించారని తెలుస్తుంది.

తాజాగా ఉన్న సమాచారం మేరకు భీష్మ మూవీ దర్శకుడు వెంకీ కుడుముల చెప్పిన కథ మహేశ్ బాబు కు బాగా నచ్చిందట. వెంకీ చెప్పిన కథ నచ్చడంతో ఆయనతో సినిమా చేయడానికి మహేష్‌ ఆసక్తిని చూపించారని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. కాగా దర్శకుడు వెంకీ కుడుములు ఛలో, భీష్మ సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్నాడు. భీష్మ మూవీ నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

- Advertisement -