‘మ‌హ‌ర్షీ’లో విల‌న్ గా సాయి కుమార్..

292
maharshi sai
- Advertisement -

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న మూవీ మ‌హ‌ర్షీ. ప్ర‌స్తుతం ఈసినిమా షూటింగ్ హైద‌రాబాద్ లోని రామోజీఫిలీం సిటీలో జ‌రుగుతుంది. మ‌హేశ్ స‌ర‌స‌న పూజా హెగ్డె హీరోయిన్ గా న‌టిస్తోంది. అల్ల‌రి న‌రేష్ ఈచిత్రంలో ప్ర‌ముఖ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. దేవి శ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాను దిల్ రాజు మ‌రియు అశ్వినిద‌త్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

sai kumar

రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన విలేజ్ సెట్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈసినిమా గురించి మ‌రోవార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఈచిత్రంలో విల‌న్ గా ఎవ‌రు క‌నిపించ‌నున్నార‌ని చ‌ర్చ‌లు జ‌ర‌గుతున్నాయి. మ‌హేశ్ కు ధీటుగా ప‌వ‌ర్ పాత్ర‌లో సాయి కుమార్ న‌టించ‌నున్నట్లు తెలుస్తుంది.

maharshi

వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించిన ఎవ‌డు సినిమాలో సాయి కుమార్ విల‌న్ పాత్ర‌లో న‌టించాడు. ఆ మూవీలో సాయి కుమార్ అద్బుతంగా న‌టించాడు. అదే సెంటిమెంట్ తో వంశీ పైడిపల్లి .. ఈ సినిమాలోను విలన్ గా సాయికుమార్ నే తీసుకున్నాడని టాక్. వ‌చ్చే వేస‌విలో ఈమూవీని విడుద‌ల చేయ‌నున్నారు.

- Advertisement -