మహేశ్ బాబు ‘మహర్షీ’ విడుదల తేది ఖరారు

301
Maharshi
- Advertisement -

 సూపర్ స్టార్ మహేశ్ బాబు , వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ మహర్షీ. ఇప్పటికే ఈచిత్రం చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మహేశ్ సరసన పూజా హెగ్డె కథానాయికగా నటిస్తుంది. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినిదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈమూవీని ఎప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.

షూటింగ్ కొంచెం ఆలస్యం కావడంతో ఈసినిమాను మే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. మే9 న మహర్షి సినిమాను విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చారు చిత్రయూనిట్. ఇక మహేశ్ బాబుకి మే నెల కలిసి రాదనే సెంటిమెంట్ ఉంది. మే నెలలో విడుదలైన సినిమాలన్ని డిజాస్టర్ గా నిలిచాయి. ఈవిషయంపై మహేశ్ బాబును ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. మహర్షి మే నెలలో విడుదలపై మహేశ్ ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి మరి.

- Advertisement -