బాలు మన మధ్య లేకపోవడం బాధాకరం: కృష్ణ

226
Super Star Krishna
- Advertisement -

ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల సూపర్ స్టార్ కృష్ణ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ‘ఈరోజు బాలు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్ణకరం. ‘నేనంటే నేనే’ సినిమాకి బాలు చేత అన్ని పాటలు పాడించాలని కోదండపాణిగారు ప్రపోజ్ చేశారు. దానికి మేమంతా ఒప్పుకున్నాం. ఆ సినిమాకి అన్ని పాటలు బాలు పాడారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది.

ఘంటసాలగారు బతికున్నప్పుడు కూడా నాకు అన్ని పాటలు బాలు పాడేవారు. బాలు మన మధ్య లేకపోవడం బాధాకరం. అతనికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. వారి కుటుంబానికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నా’ అని కృష్ణ తెలిపారు. ఈ మేరకు బాలుతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ ఓ భావోద్వేగ వీడియోను పోస్ట్ చేశారు.

- Advertisement -