సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన సునీతా లక్ష్మారెడ్డి..

165
kcr
- Advertisement -

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మరో ఆరుగురిని కమిషన్‌ సభ్యులుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నియమితులైన వి.సునీతా లక్ష్మారెడ్డి, సభ్యులు గద్దల పద్మ, రేవతిరావు, సూదం లక్ష్మి, ఈశ్వరీబాయి, షాహీన్ అఫ్రోజ్, కొమ్ము ఉమాదేవి సోమవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -