ఎక్కడికెళ్లినా భారతీయుడినే: సుందర్

282
- Advertisement -

తాను ఎక్కడికెళ్లినా భారతీయుడినేనని…ఆ వారసత్వాన్ని నాతోనే తీసుకెళ్తానని చెప్పారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్. 2022 ఏడాదికిగానూ పద్మభూషణ్ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించగా శాన్‌ ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సుందర్ పిచాయ్‌.. భారతదేశం తనలో ఒక భాగమని ..భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు అందుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఈ గౌరవం నాకు కల్పించిన భారత ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని తెలిపారు. నా తల్లిదండ్రులు, నా ఎదుగుదలకు సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -