వేసవిలో మోకాళ్ల నొప్పి…వైద్యుల హెచ్చరిక!

4
- Advertisement -

దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ అలసట, తలనొప్పి, హీట్ ఎగ్జాషన్ వంటి సమస్యలు సాధారణమే. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే వేసవి వేడి జాయింట్ల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. వృద్ధాప్యం లేదా గాయాల కారణంగా కాకుండా, డీహైడ్రేషన్ వల్ల కూడా మోకాళ్ల నొప్పి, జాయింట్ల గట్టితనం పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు.

శరీరంలో నీటి లోపం జాయింట్ల సౌకర్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని తెలిపారు. చాలా మంది తమ జాయింట్ల నొప్పి వయసు కారణంగా అనుకుంటారు. కానీ తగినంత నీరు తాగకపోవడమే అసలు కారణం కావచ్చు అని చెబుతున్నారు.

జాయింట్ల మధ్య ఉండే కార్టిలేజ్‌లో సుమారు 80 శాతం నీరు ఉంటుంది. శరీరం డీహైడ్రేట్ అయితే ఈ కార్టిలేజ్ తన లవచత్వాన్ని కోల్పోతుంది. ఫలితంగా ఎముకలు ఒకదానితో ఒకటి రుద్దుకోవడం పెరిగి నొప్పి, వాపు, గట్టితనం వస్తాయి. ముఖ్యంగా మోకాళ్లు, నడుం, నడుము భాగాలు ఎక్కువ ప్రభావితమవుతాయి.

వేసవిలో చెమట ద్వారా రోజుకు 2–3 లీటర్ల వరకు ద్రవాలు కోల్పోయే అవకాశం ఉంది. దీంతో జాయింట్లలోని సైనోవియల్ ద్రవం తగ్గి కదలికలు కష్టమవుతాయి. ఆర్థరైటిస్ ఉన్నవారిలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది.

ALso Read:బుర్జ్ ఖలీఫా భవనానికి మంటలు

రోజుకు 8–10 గ్లాసుల నీరు తాగడం, కొబ్బరి నీరు, నిమ్మరసం వంటి ఎలక్ట్రోలైట్ పానీయాలు తీసుకోవడం మంచిది. దోసకాయ, పుచ్చకాయ, పెరుగు, మజ్జిగ వంటి నీరు అధికంగా ఉన్న ఆహారాలు కూడా ఉపయోగకరం. సరైన హైడ్రేషన్ ఉన్నప్పటికీ నొప్పి తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించడం అవసరం.

- Advertisement -