ఇరాన్-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ అయిన దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా ఖాళీ అయింది. ముందస్తు జాగ్రత్త చర్యగా అందులో నివాసముంటున్న వారిని సురక్షిత ప్రాంతానికి తరలించింది అక్కడి ప్రభుత్వం.
దుబాయ్, అబుదాబి, ఖతార్, రియాద్లపై దాడులకు దిగింది ఇరాన్.ఈ క్రమంలో దుబాయ్పై ఇరాన్ మిస్సైల్ దాడుల నేపథ్యంలో బుర్జ్ ఖలీఫాను ఖాళీ చేయించింది అధికార వర్గం.
Also Read:హైదరాబాద్ని కుప్పకూల్చింది రేవంత్ రెడ్డే:కేటీఆర్
ఇక దుబాయ్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నిమిత్తం ఇంగ్లాండ్ వెళ్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో తీవ్ర ఉద్రికతల కారణంగా విమాన సర్వీసులు రద్దు కాగా ‘తదుపరి నోటీసు వరకు అన్ని సర్వీసులను రద్దు చేశారు’ అని సోషల్ మీడియాలో పేర్కొంది సింధు.

