అందరి కోసం హరిత తెలంగాణను సృష్టిద్దాం..

56
Green India Challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు హరితబంధు పర్యావరణవేత్త గ్రీన్ ఇండియా వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ వేడుకేదైనా వేదికేదైన అన్ని సందర్భాల్లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో పాలు పంచుకోవాలనే పిలుపునిచ్చారు. ఈ మేరకు గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా గురువారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యురాలు సుమిత్రానంద్ దంపతులు తమ పెళ్ళిరోజు సందర్భంగా వేప, అల్లనేరెడు మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో సుమిత్రానంద్ భర్త ఆనంద్ రావు, కుమార్తె మహతిలతో కలిసి మూడు మొక్కలు నాటి లక్షలాది మందిలో ఈ స్పూర్తిని నింపుతూ చైతన్య పరుస్తున్న సంతోష్ కుమార్ కృషికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలిపారు.”మొక్కలు నాటే మహా యజ్ఞంలో మేము సైతం” అవుతున్నందుకు సంతోషంగా ఉంది.భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలి పండ్లు సమృద్ధిగా వానలు ఈ ఉద్యమం ద్వారా అందివస్తాయని ఆశాభావం వ్యక్తమవుతున్నది.. అందరం అందరికోసం హరిత తెలంగాణను సృష్టిద్దాం…గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొందాం అని వారు పిలుపునిచ్చారు.

- Advertisement -