మళ్లీ క్రేజీ కాంబో…సుక్కుతో చెర్రీ!

173
- Advertisement -

రామ్ చరణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ఒకటి రంగస్థలం. పల్లెటూరి బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీలో ఆల్ టైం హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు మంచి మార్కులు పడగా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది ఈ చిత్రం.

తాజాగా ఈ కాంబో మళ్లీ రీపిట్ కానుంది. ప్రస్తుతం పుష్ప 2 సినిమా కోసం కసరత్తు చేస్తున్న సుకుమార్ ఈ సినిమా పూర్తి కాగానే రామ్‌ చరణ్ సినిమాను పట్టాలెక్కించనున్నారట. ప్రభాస్, మైత్రీ మూవీ మేకర్స్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు టాక్‌.

యూవీ క్రియేషన్స్ ప్రస్తుతం ప్రభాస్ తో రాజా డీలక్స్ సినిమా చేస్తోండగా దర్శకుడు శంకర్ సినిమా విడుదల కోసం చరణ్ వెయిట్ చేస్తున్నారు.

- Advertisement -